telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రజనీకాంత్ కు రాజకీయలలో మంచి జరగాలి : పవన్

pawan janasena

తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని పరిశీలించాలన్న ఉద్దేశ్యంతో జిల్లాలో పర్యటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. పంట నష్టం పై ఓ నివేదిక సిద్ధం చేసి సాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతాము. కౌలు రైతులకు అండగా ఉంటాము  ప్రతి రైతుకు తన పంటకు లాభసాటి ధర కావాలి. ఇందుకోసం ‘జై కిసాన్’ పేరిట ఓ ఉద్యమాన్ని చేపట్టనున్నాము అని పవన్ పేర్కొన్నారు. ప్రతి రైతుకు పంట నష్టం కింద కనీసం 35 వేలు ఇవ్వాలి. వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం 10 వేలు ఇస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం చేస్తున్నది సరిపోవడం లేదు… మద్యం, ఇసుకలో ప్రభుత్వం ఎంతో గడిస్తోంది… కానీ రైతులకు సరిపడా ఇవ్వడం లేదు. రైతుల కిసాన్ బిల్లులో సవరణకు కేంద్రం సిద్ధంగా ఉంది….రైతుల ఉద్యమాన్ని కేంద్రం పరిష్కరిస్తుంది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రజనీకాంత్ రాజకీయల్లోనే ఉన్నారు… ఆయనకు మంచి జరుగుతుందని భావిస్తున్నాను. తిరుపతి ఉప పోరు విషయంలో బీజేపీతో కలిసి నిర్ణయం తీసుకుంటాము… ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉంటారు అని పవన్ తెలిపారు. మరి చూడాలి ఆ అభ్యర్థి ఎవరు అనేది.

Related posts