telugu navyamedia
వార్తలు సామాజిక

గాయని లతా మంగేష్కర్ ఇంటికి బీఎంసీ సీల్

Latha Mangeshkar

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇంటికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ వేశారు. కరోనావైరస్ కారణంగా ముందు జాగ్రత్త చర్యగా లతా మంగేష్కర్ నివాస భవనం ప్రభుకుంజ్‌కు శనివారం బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సీల్ వేసింది. ప్రస్తుతానికి ఆమె కుటుంబసభ్యులు క్షేమంగానే ఉన్నారు. దీనికి సంబంధించి లతా మంగేష్కర్ కుటంబం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

‘దయచేసి మా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఎవరూ ఎక్కువగా స్పందించవద్దు. మేం అందరం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. మా అపార్ట్ మెంట్స్ లోని సీనియర్ సిటిజన్ల శ్రేయస్సు మరియు ఇతర కుటుంబాల రక్షణ కోసం ఈ చర్య తీసుకోబడింది. దేవుని దయ మరియు చాలా మంది అభిమానుల ప్రార్థన వల్ల మా కుటుంబం సురక్షితంగా ఉంది’అని తెలిపారు.

Related posts