telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్, దీపికా పదుకొనె జోడీపై కీర్తి సురేష్ రియాక్షన్…!

Keerthy-Suresh

వైజయంతి మూవీస్ బ్యానర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను తెలుగు తెరకు పరిచయం చేస్తోంది. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 21వ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపిక ప‌దుకొనేను కన్ఫర్మ్ చేస్తూ భారీ అనౌన్స్‌మెంట్ చేశారు. ఇదే ఆమెకు టాలీవుడ్ తొలి సినిమా కానుంది. అయితే ప్రభాస్‌తో దీపికా రొమాన్స్ అని తెలియగానే మరో హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన ఇన్‌స్టాగ్రమ్‌లో ప్రభాస్-దీపికా జోడీపై కీర్తి స్పందిస్తూ ”ప్రభాస్‌తో దీపికా.. చాలా చాలా పెద్ద వార్త. మరో బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని రూపొందించడానికి ఓ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ సెట్టయింది. ఇక ఈ వెయిటింగ్‌ని తట్టుకోలేను” అంటూ పోస్ట్ చేసింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న నాగ్ అశ్విన్.. మహానటి రూపంలో కీర్తి సురేష్‌కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఆమె నటనా ప్రతిభను వెలికితీశారు. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ టాలెంట్, ప్రభాస్-దీపికా స్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని కీర్తి ఇలా కామెంట్ చేసిందని చెప్పుకుంటున్నారు.

Related posts