telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ

subramanyam cs

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎస్ బదిలీ అధికార యంత్రాంగంలో కలకలం రేపుతోంది.

ఇన్ఛార్జి సీఎస్ గా నీరబ్ కుమార్ ను నియమించింది. తక్షణమే విధుల నుంచి తప్పుకుని, నీరబ్ కుమార్ కు బాధ్యతలను అప్పగించాలని సుబ్రహ్మణ్యంకు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ఎన్నికల తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. మరో ఐదు నెలల సర్వీసు ఉండగానే ఆయనను బదిలీ చేయడం గమనార్హం.

Related posts