telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాళేశ్వరంపై ఆరోపణలు కాదు, చర్యలు చేపట్టాలి.. బీజేపీని డిమాండ్ చేసిన రేవంత్!

Revanth-Reddy mp

తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ అంచనాలు రూ.35 వేల కోట్ల నుంచి ఒక్కసారిగా లక్ష కోట్లకు పెంచారంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.

బీజేపీ కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా, ఈ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. అంతకుముందు, బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్ సీఎం కేసీఆర్ నిప్పులు చెరగ్గా, దాని తాలుకూ పేపర్ క్లిప్పింగ్ ను కూడా రేవంత్ రెడ్డి తన ట్వీట్ కు జోడించారు. బీహార్ లో లాలూప్రసాద్ యాదవ్ కు పట్టిన గతే ఇక్కడ కేసీఆర్ కు కూడా పడుతుందని లక్ష్మణ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Related posts