telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

తన తల్లితో గొడవపడిందని.. టీచర్ ను పొడిచి చంపిన విద్యార్థి!

New couples attack SR Nagar

తన తల్లితో టీచర్ గొడవ పడటంతో ఓ 13 ఏళ్ల విద్యార్థి రెచ్చిపోయాడు. కత్తితో విచక్షణారహితంగా టీచర్ ను పొడిచి చంపాడు. గత సోమవారం మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్ లో అయేషా అస్లమ్(30) అనే టీచర్ పిల్లలకు ట్యూషన్ చెబుతుంది. వీరి కుటుంబానికి ఓ పాఠశాల కూడా ఉంది. అయితే ఏమయిందో తెలియదు కానీ సోమవారం రాత్రి 8.30 గంటలకు కత్తితో బాలుడు ఆయేషాపై దాడిచేశాడు. ఆయేషా అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.

విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మా అమ్మ అయేషాను డబ్బులు అడిగింది. ఆమె ఇవ్వకపోవడంతోనే నేను హత్య చేశా అని బాలుడు స్థానికులకు చెప్పాడు. మరోవైపు కుమారుడి నిర్వాకం తెలియగానే అతని తల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Related posts