ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కోడెలను హత్య చేసింది వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ప్రభుత్వం వేధిస్తోందని నా ముందు కోడెల ఏడ్చారని చెప్పారు. చేసిందంతా చేసి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకని మండిపడ్డారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినంత మాత్రాన కోడెల ఆత్మ శాంతిస్తుందా? అని మండిపడ్డారు.
పల్నాడులో టీడీపీని దెబ్బ తీయడానికి కోడెలను టార్గెట్ చేశారని ఆరోపించారు. కోడెలతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. టీడీపీ నేతలపై కేసుల మీద కేసులు పెట్టడం దారుణమని గోరంట్ల మండిపడ్డారు. చివరకు కోడెల అంత్యక్రియలపై కూడా ఆంక్షలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలను అనుమతించకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారని అన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో కేబుల్ ప్రసారాలను నిలిపివేశారని చెప్పుకొచ్చారు.
ఏపీ అసెంబ్లీలో కడప ఫ్యాక్షన్ ..అచ్చెన్నాయుడు ఫైర్