బాలబాలికలు సోదరభావంతో మెలగాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటునయని అన్నారు.ఢిల్లీ ప్రభుత్వం మాత్రం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు మానవత్వంతో మెలిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. బాలికలతో ఎప్పుడూ కూడా అసభ్యకరంగా ప్రవర్తించం అని బాలురతో ప్రతిజ్ఞ చేయించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.
ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో అమలు చేస్తామన్నారు. బాలికల పట్ల బాలురు అసభ్యంగా ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ కుమారుల ప్రవర్తనను అబ్జర్వ్ చేయాలి. బయట అమ్మాయిలను వేధించినట్లు తెలిస్తే ఇంట్లోకి రానివ్వమనే ఆదేశాలు తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాలని సీఎం చెప్పారు.