ఏపీ సీఎం జగన్కు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోశాలల ఏర్పాటు కమిటీకి జీవో ఇచ్చారని ఆయన తెలిపారు. , రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఆ కమిటీలు వేయలేదని లేఖలో పేర్కొన్నారు.
గత ఏడాది సింహాచలంలో మూడు ఆవులు చనిపోయాయని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. తాడేపల్లి గోశాలలో విష ప్రయోగం వల్ల వంద ఆవులు మృతి చెందారని ఆయన చెప్పారు. అన్ని వర్గాలతో కలిపి గోశాలల అభివృద్ధికి కమిటీలు వేయాలని ఆయన లేఖలో ప్రస్తావించారు.