telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌కు రఘురామకృష్ణరాజు మరో లేఖ

raghauramakrishnam raju mp

ఏపీ సీఎం జగన్‌కు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోశాలల ఏర్పాటు కమిటీకి జీవో ఇచ్చారని ఆయన తెలిపారు. , రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఆ కమిటీలు వేయలేదని లేఖలో పేర్కొన్నారు.

గత ఏడాది సింహాచలంలో మూడు ఆవులు చనిపోయాయని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. తాడేపల్లి గోశాలలో విష ప్రయోగం వల్ల వంద ఆవులు మృతి చెందారని ఆయన చెప్పారు. అన్ని వర్గాలతో కలిపి గోశాలల అభివృద్ధికి కమిటీలు వేయాలని ఆయన లేఖలో ప్రస్తావించారు.

Related posts