telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీవీ5 ఆఫీసుపై రాళ్ల దాడి..నారా లోకేశ్ ఫైర్

Nara Lokesh

హైదరాబాద్‌లోని టీవీ5 కార్యాలయంపైకి కొందరు దుండగులు రాళ్లు రువ్వి గత అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. టీవీ 5 కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మీడియా ఆఫీసుపై రాళ్ల దాడి పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాపై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు.

పత్రికా స్వేచ్ఛని హరించే విధంగా జరుగుతున్న సంఘటనలపై మీడియా ఐక్యంగా పోరాటం చెయ్యాలన్నారు. లేకపోతే ఇలాంటి పరిస్థితి అందరికీ వచ్చే ప్రమాదం ఉందని లోకేశ్ పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మీడియా దాడులను తీవ్రంగా ఖండించి భావ ప్రకటనా స్వేచ్ఛని కాపాడటానికి ముందుకు రావాలని పెకొన్నారు. వెంటనే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆయన ట్వీట్లు చేశారు.

Related posts