టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తిరిగి టీడీపీని అధికారంలోకి తేవాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. చంద్రబాబు మొదటి నుంచి కుప్పం నుంచే ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సతీమణీ భువనేశ్వరి కుప్పం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
చంద్రబాబును తిరిగి సీఎం చేయాలని ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె అన్నారు. ఈసారి 75శాతం ఓట్లతో డిస్టింక్షన్లో చంద్రబాబును పాస్ చేయించాలని చెప్పారు. ప్రజలతో మమేకం కావాలని అతివిశ్వాసం వద్దని కార్యకర్తలకు భువనేశ్వరి సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో కుప్పం నియోజకవర్గం నుంచి రెండు వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
చట్టాల సవరణపై కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం సరికాదు: డీకే అరుణ