telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రియుడుతో క‌లిసి విశాఖ‌కు చేరుకున్న సాయిప్రియ..

పెళ్లిరోజునాడు భర్తకు మస్కాకొట్టి ప్రియుడితో ఎస్కేప్ అయిన సాయి ప్రియాంక తిరిగి వైజాగ్ వచ్చింది. ప్రియుడ్ని రెండో పెళ్లి చేసుకొని బెంగళూరు వెళ్లిన సాయి ప్రియాంకను పోలీసులు ఎట్టకేలకూ విశాఖకు తీసుకు వచ్చారు.

వీరిద్దరిని మొదట  ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో తీసుకొచ్చారు. అక్కడినుంచి వారిని వైజాగ్ త్రీటౌన్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు వారి నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు.

అక్క‌డ‌ ఇరువైపుల పెద్దలను పిలిపించి మాట్లాడారు. ముందుగా కుమార్తె సాయిప్రియతో తల్లిదండ్రులు మాట్లాడారు. తమ పరువు తీశావంటూ రోదించారు. తాను రవితో ఉంటానని ఆమె తేల్చి చెప్పింది.

మరోవైపు సాయిప్రియాంక చేసిన పనిపై మీడియా నిలదీసింది. తమ వల్ల ప్రభుత్వానికి కోటి రూపాయలు ఖర్చయినందుకు క్షమించమని రవి కోరాడు. మీడియాతో మాట్లాడుతుండగా సాయిప్రియ సొమ్మసిల్లి పడిపోయింది.ఆమెకు సపర్యలు చేయగా తేరుకుంది

అలాగే సాయి ప్రియాంకకు భర్త ఇచ్చిన రెండు గాజులు ఏం చేశారని ప్రశ్నించగా.. గాజులు తమ దగ్గరే ఉన్నాయని తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. తమకు తల్లిదండ్రుతో కలిసి ఉండలేమని.. ప్రియాంకను తానే పోషిస్తానని రవి సమాధానమిచ్చాడు.

విశాఖపట్నంకు చెందిన శ్రీనివాస్ కు రెండేళ్ల క్రితం సాయి ప్రియాంకతో పెళ్లయింది. ప్రస్తుతం శ్రీనివాస్ హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేతుండగా.. ప్రియాంక మాత్రం విశాఖలో ఉండి చదువుకుంటోంది. ఈనెల 25న పెళ్లి రోజు కావడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రీనివాస్.. భార్యకు బంగారు గాజులు గిఫ్టుగా ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ సింహాచలం గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం రెస్టారెంట్ కు వెళ్లి లంచ్ చేసిన తర్వాత సాయంత్రం విశాఖ బీచ్ కు వెళ్లి సరదాగా గడిపారు. ఇద్దరూ సెల్ఫీలు తీసుకొని ఉత్సాంగా ఉన్నారు. రాత్రి 8గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఈలోగా శ్రీనివాస్ ఫోన్ కు మెసేజ్ రావడంతో మొబైల్ చూసుకుంటూ నడుస్తున్నాడు. ఇంతలో కాళ్లు కడుక్కొని వస్తానంటూ మళ్లీ బీచ్ వద్దకు వెళ్లిన సాయి ప్రియాంక ఆ తర్వాత కనిపించలేదు. దీంతో తన భార్య బీచ్ లో గల్లంతయిందంటూ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాద చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆమెను గాలించడం మొదలుపెట్టారు. ఐతే ఎక్కడో తేడా కొడతుందని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా.. భర్తను మాయ చేసి ప్రియుడితో పారారైన‌ట్టు తెలిసింది. మొద‌ట‌ నెల్లూరులో ఆచూకీ కనిపెట్టగా.. ఆ తర్వాత తాను బెంగళూరులో ఉన్నానని.. ప్రియుడి రవిని పెళ్లి చేసుకున్నానంటూ ప్రియాంక తన తండ్రికి వాయిస్ మెసేజ్ చేసింది. ఫోటోలు కూడా పెట్టింది. దీంతో బెంగళూరు వెళ్లిన పోలీసులు ఇద్దర్నీ విశాఖ తీసుకొచ్చారు.

Related posts