telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: జగన్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. సభ ప్రారంభంలో తీవ్ర గందరగోళం నెలకొంది. భరోసా కేంద్రాలపై గందరగోళం మధ్యే చర్చను ప్రారంభించారు.ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ టీడీపీ సభ్యులపై విరుచుకుపడ్డారు. సభలో టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ సభ్యుల తీరుతో సభ నడిచే అవకాశం లేకుండాపోతోందని అన్నారు. ఏపీలో రైతు పోడియం రింగ్ దాటి వస్తే మార్షల్స్‌ను రంగంలోకి దింపండని జగన్ అన్నారు.టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని జగన్ చెప్పారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోందని తెలిపారు. సభలో మాట్లాడే చేతకాకపోతే సభ బయటే ఉండాలని ఆయనఅన్నారు.

Related posts