telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎంపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ

ap speaker tammineni

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేస్తుండడంతో వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలపై చర్చ జరుగుతుండగా అడ్డుపడిన టీడీపీ సభ్యుల తీరు సరికాదని వైసీపీ సభ్యుడు సుధాకర్ బాబు అన్నారు. జగన్‌పై నమ్మకం ఉంచే ప్రజలు తమకు ఓట్లు వేశారని ఆయన అన్నారు.

సీఎంపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సభలో స్పీకర్‌ను, సీఎం జగన్‌ను అవమానిస్తే ప్రజలు ఊరుకోబోరని, అలాగే చట్టసభలకు విలువ ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.

Related posts