రష్యాలో సైబీరియా ప్రాంతంలోని టామ్స్కే పట్టణ శివారులో ఉన్న ఓ గ్రామంలోని టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు మృతిచెందారని అధికారులు తెలిపారు. మృతుల్లో 10 మందిని ఉజ్బెకిస్థాన్కు చెందిన వారిగా గుర్తించామని రష్యా అత్యవసర మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రిచులింస్కై సెటిల్మెంట్లోని ఓ ప్రైవేటు టింబర్ డిపోలో ఈ ప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగి అక్కడే కలపతో నిర్మించిన ఇంట్లో ఉంటున్న కూలీలు మృతిచెందారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ గవర్నర్ తెలిపారు.
కేసీఆర్ ఓ తుగ్లక్ ముఖ్యమంత్రిగా వ్యవహిరిస్తున్నారు: మాజీ ఎంపీ వివేక్