telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి: పురందేశ్వరి

purandeshwari bjp

కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వగ్రామం ప్రకాశం జిల్లా కారంచేడులో ఆమె మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో బీజేపీని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు.

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని పురందేశ్వరి పేర్కొన్నారు. రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని, మూడు రాజధానుల అంశంలో కేంద్రం పాత్ర పరిమితమని వివరించారు.

దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న సమయంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ఏమంత సులభం కాదని, అయితే ప్రజల పక్షాన నిలిచి వారిలో నమ్మకం కలిగిస్తామని అన్నారు.తనపై ఎంతో నమ్మకం ఉంచి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు ఆమె పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Related posts