telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : మ్యాచ్ గెలిచి మొదటి స్థానానికి వచ్చిన ముంబై…

ఐపీఎల్ 2020 లో ముంబై ఇండియన్స్‌ జోరు కొనసాగుతోంది. నిన్న రెండు మ్యాచ్ లో టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ తొలి ఓవర్‌లోనే పృథ్వీషాను బౌల్ట్ పెవిలియన్‌కు పంపగా.. సీజన్‌లో తొలిమ్యాచ్ ఆడిన రహానే ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 162 పరుగులు చేసింది.  ఢిల్లీ కేపిటల్స్ నిర్ధేశించిన 163 పరుగుల టార్గెట్‌ ను… 19.4 ఓవర్లలో ఛేదించింది ముంబై ఇండియన్స్.. డికాక్‌ , సూర్యకుమార్‌ అర్థశతకాలతో రాణించారు. రోహిత్ శర్మ స్వల్ప పరుగులకే వెనుదిరగ్గా, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. డికాక్‌ 32 బంతుల్లో అర్ధశతకం సాధించిన డికాక్… అశ్విన్ బౌలింగ్‌లో షా చేతికి చిక్కాడు. ఇషాన్ కిషన్‌ తో కలిసి సూర్యకుమార్ మరింత చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లు సాధిస్తూ 30 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తిచేశాడు. ఇక ఆరు బంతుల్లో 7 పరుగులు అవసరం కాగా… కృనాల్ పాండ్య రెండు బౌండరీలు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ముంబై విజయం లో కీలక పాత్ర పోషించిన డికాక్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ విజయంతో రెండు స్థానంలో ఉన్న ముంబై మెదటి స్థానానికి వచ్చింది.

Related posts