telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మణిశర్మాను వద్దు అంటున్న చిరు…

Chiranjeevi

రాజకీయాల కారణంగా సినిమాల నుండి తప్పుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్వకత్వంలో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఆచార్య సినిమా స్టార్ మ్యుజీషియన్ మణిశర్మా సంగీతం అందిస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా చిరంజీవి దేవీశ్రీప్రసాద్ కావాలని అంటున్నారంట. ఈ వేరకు వార్తలు సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆచార్య సినిమాకి మణి శర్మ అందించిన సంగీతం చిరుకి నచ్చలేదని, అందుకనే డీఎస్‌పీ కావాలని అంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరు దేవిశ్రీని కావాలంటుంది ఆచార్యకు కాదంటలేండి. చిరు డైరెక్టర్ బాబీతో చేయనున్న సినిమాకంట. ఈ సినిమాకు దర్శకుడు మణిశర్మను ఓకే చేశారంట. అందుకే సంగీత దర్శకుడిని మార్చమని చిరు సలహా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వార్తలకు సబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.. అలాగే ఎవరిని తీసుకుంటారు అనేది.

Related posts