telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చంద్రబాబు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు : రోజా

roja ycp mla

విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఆమె అనంతరం ఏపిఐసిసి చైర్మన్ రోజా మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో, రాజ్యసభలో విశాఖ ఉక్కు కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలే వాయిస్ రైజ్ చేస్తున్నారని రోజా అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు వైసిపి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్ అని , ఎంతో మంది త్యాగ ఫలమని, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్రకి పూర్తి మద్దతు ఇస్తున్నామని అన్నారు ఆమె.  చంద్రబాబు విశాఖ వచ్చి ఏదో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రయివేటీకరణ చేయటానికి వ్యతిరేకమని చెబుతున్న చంద్రబాబు గతంతో వారితోనే చేతులు కలిపారని అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రి గా ఉన్నాప్పుడే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు అడుగులుపడ్డాయని ఆమె అన్నారురు. విశాఖ వచ్చిన లోకేష్ అందరి మెడలు వంచుతామని మాట్లాడుతున్నారని, మంగళిగిరిలో లోకేష్ కు, కుప్పంలో మీ చంద్రబాబుకు ప్రజలు మెడలు వంచారని ఇంకా ఎక్కువ చేస్తే విశాఖ కార్పోరేషన్ ఎన్నికలలో బుద్ది చెబుతామని ఆర్కే రోజా హెచ్చరించారు.

Related posts