telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కెసిఆర్ ను మెచ్చుకున్న బండి సంజయ్ !

ఆయుష్మాన్ భారత్ లో చేరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్ తో రేపు చేపట్టిన ” గరీబోళ్ల కోసం బిజెపి దీక్ష” ను వాయిదా వేస్తున్నామని బండి సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేయాలని బిజెపి వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన ఒత్తిడి ఫలించిందని… ఆయుష్మాన్ భారత్ లో చేరాలని ఆలస్యంగానైనా తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేయడంతో పాటు పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.

Related posts