సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ లాక్డౌన్ తరువాత పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా చేయబోతున్నారు. ఇటీవల మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లుగా రాజమౌళి కీలక ప్రకటన చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ ప్రాజెక్టుపై పడింది. రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని, పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని భారీ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వాలనే దిశగా ఆలోచిస్తున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు. తన రెస్పాన్స్ తెలియజేస్తూ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పాలని భావిస్తున్నారట. ఇందుకోసమై తన తండ్రి పుట్టిన రోజైన మే 31వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ అభిమానులను సర్ప్రైజ్ చేసేలా ఈ అప్డేట్ ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
previous post