telugu navyamedia
సినిమా వార్తలు

మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అదితిరావు హైదరి

Aditi-Rao-Hydari

హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2018లో బాలీవుడ్ బ్యూటీ, హీరోయిన్ అదితిరావు హైదరి మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన “సమ్మోహనం” చిత్రంలో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది అదితి. తెలుగులో అదితికి ఇదే మొదటి చిత్రం. అతితక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులు తనను ఇంతలా ఆదరించడం పట్ల అదితి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం అదితి హిందీ, తమిళ చిత్రాల్లోనే కాకుండా ఇంద్రగంటి డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలో నానికి జతగా నటించనుంది. ఇక ఈ జాబితాలో మోడల్ శ్రేయ రావ్ 2వ స్థానాన్ని దక్కించుకోగా, సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్న వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు.

Related posts