కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో కర్ణాటక విధానసభకు స్పీకర్గా విశ్వేశ్వర ఎన్నికైనట్లు స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. విశ్వేశ్వర వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కర్ణాటక విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆయనవైపు మొగ్గు చూపారు. పార్టీ నాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విలువలతో కూడిన సేవలందిస్తానని ఈ సందర్భంగా విశ్వేశ్వర అభిప్రాయపడ్డారు. కాగా యెడియూరప్ప తొలి మంత్రివర్గంలో దాదాపు 10 నుంచి 12 మందిని చేర్చుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.