చిన్నారులకు పౌష్టికాహారం అందించి, విద్యాబుద్దులు నేర్పే అంగన్వాడీ కార్యకర్త పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అంగన్వాడీ సెంటర్ లో పాఠాలు చెబుతున్నా సమయంలో టీచర్పై ఆమె మరిది దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం ముగడవలసలో ఈ దారుణం చోటు చేసుకుంది. అంగన్వాడి సెంటర్లో టీచర్ పోలమ్మపై ఆమె కత్తితో దాడి చేశాడు. స్థానికులు హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం పోలమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
previous post
చంద్రబాబుకు ఓటు ద్వారా రాజకీయ శిక్ష: మందకృష్ణ