ఆంధ్రప్రదేశ్ లో ని చిత్తూర్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని కుప్పం మండలంలో ఏనుగు వీరంగం చేసింది. నాలుగు రోజలు క్రితం పర్తి చేనులో దాడి చేయగా ఓ యువతి మృతి చెందింది. తాజాగా మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిన్న రాత్రి గుడుపల్లి, శాంతిపురం మండలాల్లో ఒంటరి ఏనుగు దాడి చేసింది.
ఈ దాడిలో చింతరపల్యంలో నారాయణప్ప అనే రైతు తీవ్రంగా గాయపడ్డారు. శాంతిపురం మండలం రాళ్లపల్లిలో పొలం పనులు చేస్తున్న పాపమ్మపై ఏనుగు దాడి చేయగా ఆమె మృతి చెందింది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులను బంధించాలని అటవీ అధికారులను స్థానికులు కోరుతున్నారు.