telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఏనుగు దాడిలో మహిళ మృతి

elephant got freedom after 50 years celeb

ఆంధ్రప్రదేశ్ లో ని చిత్తూర్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని కుప్పం మండలంలో ఏనుగు వీరంగం చేసింది. నాలుగు రోజలు క్రితం పర్తి చేనులో దాడి చేయగా ఓ యువతి మృతి చెందింది. తాజాగా మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిన్న రాత్రి గుడుపల్లి, శాంతిపురం మండలాల్లో ఒంటరి ఏనుగు దాడి చేసింది.

ఈ దాడిలో చింతరపల్యంలో నారాయణప్ప అనే రైతు తీవ్రంగా గాయపడ్డారు. శాంతిపురం మండలం రాళ్లపల్లిలో పొలం పనులు చేస్తున్న పాపమ్మపై ఏనుగు దాడి చేయగా ఆమె మృతి చెందింది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులను బంధించాలని అటవీ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

Related posts