telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు.. ఏకంగా 50 వేలకు చేరువలో

బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్‌ మార్కెట్‌లో రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 48,550 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 44, 500 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1900 పెరిగి రూ. 76,100 వద్ద కొనసాగుతోంది.

Related posts