ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోతున్నట్టు ఓ తమిళ దినపత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆదిలోనే హంసపాదు’ అనే శీర్షికతో తమిళ దినపత్రిక ‘దిన మలర్’ మంగళగిరిలో అసెంబ్లీ ని నుంచి బరిలోకి దిగిన లోకేశ్ కు ఓడిపోతానన్న భయం ఉందన్నది ఈ కథనం సారాంశం. తండ్రి సీఎంగా ఉండి కూడా, ఓటమి తప్పదేమోనన్న ఆందోళనలో లోకేశ్ ఉన్నారని పత్రికలో వివరించింది.
మంత్రిగా ఉండి కూడా కచ్చితంగా గెలుస్తానన్న ధైర్యం ఆయనలో లేదని పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్న లోకేశ్ కు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తరువాత గెలుపు సులభం కాదని తెలుస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆందోళనలో ఉన్నారని కథనంలో పేర్కొంది.