కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. తాజాగా లీటరు పెట్రోలుపై 7 పైసలు, డీజిల్ పై 6 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపుతో ఢిల్లీలో లీటరు ధర రూ.73.13కు, డీజిల్ ధర రూ.66.71కు చేరింది.
కోల్ కతా, ముంబై నగరాల్లో లీటరు పెట్రోలుపై 7 పైసలు, చెన్నైలో 8 పైసల మేరకు పెరిగింది. డీజిల్ ధర లీటరుకు 9 పైసలు చొప్పున పెరిగింది. అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు మొదలైన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరిగిపోతున్నాయి.