ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు టైటిల్స్ అందించాడు ఎంఎస్ ధోనీ. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ధోనీ తాజాగా మరో అరుదైన రికార్డు తన పేరుపై లికించుకున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో 150 మందిని ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్గా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో మహీ ఈ ఫీట్ అందుకున్నాడు. కోల్కతా ఓపెనర్ నితీశ్ రాణా క్యాచ్ అందుకోవడం ద్వారా మహీ ఈ మైలురాయి చేరుకున్నాడు. ఐపీఎల్ లీగ్లో ధోనీ ఇప్పటి వరకు 111 క్యాచ్లు అందుకోగా.. 39 స్టంపౌట్లు చేశాడు. ధోనీ తర్వాత కోల్కతా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కార్తీక్ ఇప్పటి వరకు 112 క్యాచ్లు, 31 స్టంపింగ్లు చేశాడు. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ టోర్నీలో 208 మ్యాచులు ఆడి 4667 రన్స్ చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
previous post