telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ ఎమ్మెల్సీల వాహనాలను అడ్డుకున్న పోలీసులు

TDP Change Puthalapattu Candidate

శాసనమండలి సమావేశాలకు వెలుతున్న టీడీపీ ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. శాసనమండలికి వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు.

వాహనాలపై ఎమ్మెల్సీ స్టిక్కర్లు లేకుండా ఎలా వెళ్తారని పోలీసులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీలే వాహనాల్లో ఉంటే స్టిక్కర్లు ఎందుకని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ వాదోపవాదాలు జరిగియి. కాసేపటి తర్వాత ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అనుమతించారు. దీంతో వారు శాసనసభ మండలి సమావేశాలకు హాజరయ్యారు.

Related posts