మంత్రివర్గ నిర్ణయాలు తప్పని చట్ట సభలో రుజువైందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…రాష్ట్ర చరిత్రలో తొలిసారి మండలిలో రూల్ 71 ప్రయోగం జరిగిందని యనమల తెలిపారు. మంత్రి వర్గం నిర్ణయం తప్పైతే దానిని సభలో ఆమోదించవచ్చా? లేదా? అని తేల్చేదే రూల్ 71 అని వివరించారు. రూల్ 71 పై జరిగిన చర్చ ఓటింగ్లోనూ తమ తీర్మానం నెగ్గిందని గుర్తు చేశారు.
శాసన మండలి ఛైర్మన్ ఏం నిర్ణయిస్తారో దాన్ని బట్టే టీడీపీ వ్యూహం ఉంటుందని రూల్ 71లాంటి అస్త్రాలు మా వద్ద చాలా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ బిల్లులపై చర్చ జరిపి సెలెక్ట్ కమిటీకి పంపే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అడ్డుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.