తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 17న కరీంనగర్ లో జరిగిన ఓ బహిరంగ సభలో కేసీఆర్ హిందువుల పట్ల అవమానకర రీతిలో మాట్లాడారంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) తెలంగాణ విభాగం అధ్యక్షుడు రామరాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్దంగా మాట్లాడడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రామరాజు ఫిర్యాదును పరిశీలించిన ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొంది.
ఆ రాష్ట్రాల్లో ప్రియాంకా గాంధీ ఎందుకు ప్రచారం చేయడం లేదు: కేజ్రీవాల్