telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఏపీఎస్ఆర్టీసీ వేటు!

apsrtc bus

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ వేటు వేసింది. ఏకంగా 6 వేల మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు నుంచి విధులకు హాజరు కావద్దంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు డిపో మేనేజర్లు ఆర్డర్ జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు విధుల నుంచి తొలగిస్తున్నట్టు డిపో మేనేజర్లు తెలిపారు.

ఏప్రిల్ నెల జీతాలు కూడా వీరికి ఇంత వరకు అందలేదు.ఈ నేపథ్యంలో, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్య తీరును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించింది.

Related posts