మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్కు బెయిల్ లభించింది. గత ఏడాది సెప్టెంబర్లో తన ఆశ్రమంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
షహజన్పూర్లో లా కాలేజీలోఅడ్మిషన్ విషయమై తనకు సహాయపడిన చిన్మయానంద్..తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆరోపించిన సంగతి తెలిసిందే. కాలేజ్లోని హాస్టల్లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్.. వాటిని వైరల్ చేస్తానని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.
జగన్ కోసం కుట్రలకు..ఏపీలో కేసీఆర్ ప్లాన్: దేవినేని