telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం సాగినట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.

ఈ భేటీ సందర్బంగా పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన ఇవ్వాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే, ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్ చర్చించినట్టుగా తెలుస్తోంది.

Related posts