telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో దూసుకుపోతున్న కరోనా.. 24 గంటల్లో కొత్తగా 81 కేసులు!

corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి దూసుకుపోతోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 81 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. కర్నూలులో కొత్తగా 4, గుంటూరులో 3, కడపలో 3, అనంతపురంలో 2, తూర్పు గోదావరి జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 52, ప్రకాశం జిల్లాలో 3, పశ్చిమ గోదావరిలో 12 కేసులు నమోదయ్యాయి.

విజయనగరంలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,097కి చేరింది. కర్నూలులో అత్యధికంగా 279, గుంటూరులో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 835కు చేరుకుంది. 231 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Related posts