telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఐపీఎస్ పై  దౌర్జన్యం కేసులో.. టీడీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

hicourt orders to sit on viveka murdur case
ఏపీ టీడీపీ ముఖ్య నేతలకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యాన్ని దూషిస్తూ, బెదిరింపులకు దిగిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీసు హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ నాగుల్‌ మీరాకు హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. విజయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారా వీరికి నోటీసులు అందచేయాలని స్పష్టం చేసింది. 
2017లో రవాణాశాఖ కమిషనర్‌పై దౌర్జన్యంకు పాల్పడిన ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కేసు తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం  ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts