ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలోని వెండి వెండి సింహాలు అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంపై నిలదీసిన వీడియోను పోస్ట్ చేశారు.
అనంతరం ఆ పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. తాము అడుగుతోన్న ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఎప్పుడూలేని వింతపోకడలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.
భక్తులు జైల్లో ఉంటే అరాచకశక్తులు రోడ్లపైనా? తిరుగుతున్నాయని ప్రశించారు. చవితి వేడుకలకు ఆంక్షలు విధించిన ప్రభుత్వం, పుట్టినరోజు వేడుకలకు మాత్రం ప్రోత్సాహకాలతో జీవోలతో హడావుడా? అని నిలదీశారు. ఆలయ ఘటనలను ముఖ్యమంత్రి ఎందుకు ఖండించడం లేదని అడుగుతున్న చంద్రబాబు నాయుడి మాటలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని నిలదీశారు.