telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెల్ల రేషన్ కార్డు లబ్డిదారులకు ఏపీ సర్కార్ శుభవార్త!

AP ration cards

తెల్ల రేషన్ కార్డు లబ్డిదారులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ… ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయన్నారు. కేంద్రం నుంచి వస్తున్న బియ్యం‌లో కూడా 25 శాతం నూకే వస్తుందని తెలిపారు. నాణ్యత లేని బియ్యం సరఫరా వల్ల అన్నం ముద్దగా మారుతోందని వెల్లడించారు. అందుకే రేషన్ షాపుల్లో వినూత్న మార్పులు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. కల్తీ లేని సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

Related posts