telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాళేశ్వరం వల్ల మేం నష్టపోయేదేం లేదు: ఫడ్నవిస్‌

Kaleshwaram kcr

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ కాళేశ్వరం వల్ల మేం నష్టపోయేదేం లేదని, మాకూ నీళ్లు వస్తాయన్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రమే మారనుందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్‌ను మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలకు అందించిన కానుక అని ఆయన చెప్పుకొచ్చారు. రికార్డు వేగంతో ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిందని తెలంగాణ సర్కార్‌పై ఫడ్నవిస్ ప్రశంసల వర్షం కురిపించారు.

Related posts