telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్… విజయం ఎవరిదంటే..?

గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 47 శాతం ఓట్లు సాధించి టిఆర్‌ఎస్ బల్దీయాపై మరోసారి గులాబీ జెండా ఎగరవేయనుందని సర్వేలు తేల్చి చెప్పాయి. శుక్రవారం గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. పాత మలక్ పేటలో గురువారం రీపోలింగ్ అనంతరం పలు సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. టిఆర్‌ఎస్ వందకు పైగా సీట్లను సాధిస్తుందని థర్డ్ విజన్ సర్వే తేల్చి చెప్పింది. టిఆర్‌ఎస్ కు 90 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఎంఐఎం 35-38, బిజెపి 5-12, కాంగ్రెస్ 1 స్థానాల్లో విజయం సాధిస్తాయని థర్డ్ విజన్ సర్వే తేలింది. టిఆర్‌ఎస్‌కు 82 నుంచి 96 స్థానాలు వస్తాయని సిపిఎస్ సర్వే తేల్చిచెప్పింది. బిజెపికి 12 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉందని సిపిఎస్ సర్వేలో తేలింది. ఎఐఎం 32-38, కాంగ్రెస్ 3-5 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని సిపిఎస్ సర్వే తెలిపింది. టిఆర్‌ఎస్ కు 78 సీట్లు వస్తాయని ఆరా సంస్థ సర్వేలో వెల్లడైంది. ఎంఐఎం 41, బిజెపి28, కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఆరా సర్వేలో తేలింది.

Related posts