ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోడెల మృతి చాలా బాధాకరం అన్నారు. ఆయన మృతిని తాము జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. కోడెల మృతికి ప్రభుత్వమే కారణమంటూ పరోక్షంగా ఆరోపించారు.
రాజకీయాల్లో వేధింపులు సరికాదన్నారు. ప్రభుత్వం తనను వేధిస్తోందని కోడెల నిత్యం ఆవేదన చెందేవారని తెలిపారు. కేసులమీద కేసులు పెట్టడ ఎంతవరకు సమంజసమో ప్రభుత్వ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కోడెల శివప్రసాదరావు పల్నాటి పులి అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు.