డిచ్ పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో ఈ రోజు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఎంసిఏ బిల్డింగ్ వద్ద చిరుత కనిపించినట్టు గుర్తించిన విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. విషయం తెలుసుకున్న వర్సిటీ రిజిస్ట్రార్ నసీం వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు చిరుత ఆనవాళ్ల కోసం యూనివర్సిటీ పరిసరప్రాంతాల్లో గాలిస్తున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ రోజు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 22వ తేదీన తిరిగి నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి వెల్లడించారు.
ఇసుక విధానంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి: పురంధేశ్వరి