హైదరాబాద్ ఫిలింనగర్లో సినీ నటుడు మహేశ్ బాబు ఇంటి ఎదుట విద్యార్థులు దీక్షకు దిగారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన పోరాట సమితి రాహార దీక్ష చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
రాజధాని అంశంపై ఏపీకి చెందిన సినీ హీరోలు, నటులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 19 వరకు హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామని విద్యార్థులు ప్రకటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని, కర్నూల్లో హైకోర్టు, అమరావతి, విశాఖలో బెంచీలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.