*సాయంత్రం 5గంటలకు మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం
*5గంటలోపు తెలంగాణ ప్రగతి భవన్కు చేరుకోవాలని మంత్రులకు సీఎంవో నుంచి ఆదేశం..
*రాష్ర్ట ఆర్ధిక పరిస్థితి.. తెలంగాణ పై కేంద్రం అనుసరిస్తున్న తీరు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం 5గంటలకు మంత్రులతో సమావేశం కానున్నారు. జిల్లాల్లో పర్యటనల్లో ఉన్న మంత్రులకు సాయంత్రం 5గంటలోపు తెలంగాణ ప్రగతి భవన్కు చేరుకోవాలని సీఎంవో నుంచి ఆదేశం వెళ్ళినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో రాష్ర్ట ఆర్ధిక పరిస్థితి.. తెలంగాణ పై కేంద్రం అనుసరిస్తున్న తీరు.. రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారు.
ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు..రాజకీయంగా ఎలా ముందుకెళ్ళాలనేది..రాష్ట్రపతి ఎన్నికల అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సీపీఐ, సీపీఎంలు పార్టీ సిద్ధాంతాలను అమ్ముకున్నాయి: బీజేపీ నేత