telugu navyamedia
తెలంగాణ వార్తలు

సాయంత్రం మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం..

*సాయంత్రం 5గంట‌ల‌కు మంత్రుల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం
*5గంట‌లోపు తెలంగాణ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకోవాల‌ని మంత్రుల‌కు సీఎంవో నుంచి ఆదేశం..
*రాష్ర్ట ఆర్ధిక ప‌రిస్థితి.. తెలంగాణ పై కేంద్రం అనుస‌రిస్తున్న‌ తీరు..

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం 5గంట‌ల‌కు మంత్రుల‌తో స‌మావేశం కానున్నారు. జిల్లాల్లో పర్యటనల్లో ఉన్న మంత్రులకు సాయంత్రం 5గంట‌లోపు తెలంగాణ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకోవాల‌ని సీఎంవో నుంచి ఆదేశం వెళ్ళిన‌ట్లు తెలుస్తోంది.

ఈ స‌మావేశంలో రాష్ర్ట ఆర్ధిక ప‌రిస్థితి.. తెలంగాణ పై కేంద్రం అనుస‌రిస్తున్న‌ తీరు.. రాష్ర్టంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై మంత్రుల‌తో కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు.

ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న‌టువంటి విమ‌ర్శ‌లు..రాజ‌కీయంగా ఎలా ముందుకెళ్ళాల‌నేది..రాష్ట్రపతి ఎన్నికల అంశంపైనా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

Related posts