telugu navyamedia
రాజకీయ వార్తలు

ట్విట్టర్ లో ప్రశ్నలు వద్దు..రాహుల్ కు కేంద్ర మంత్రి హితవు

minister ravisankar on economy

 సరిహద్దులను దాటి భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సరిహద్దు సమస్యలపై రాహుల్ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న నేపథ్యంలో కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు.

అంతర్జాతీయ అంశాలు, గోప్యత నెలకొన్న ఈ తరహా అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఇకపై ప్రశ్నలు వేయవద్దని ఆయన సలహా హితవుపలికారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఇంటర్నేషనల్ ఇష్యూలపై ట్విట్టర్ లో ఏమీ అడగవద్దన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. గతంలో బాలాకోట్ దాడులపైనా, ఊరీ దాడులపైనా ఆధారాలను రాహుల్ అడిగారని గుర్తు చేశారు.

Related posts