telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనాతో కేంద్ర మంత్రి మృతి

Suresh Angadi

దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికీ ఈ మహమ్మారితో ఎందరో ప్రజాప్రతినిధులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి కరోనా బారినపడి కన్నుమూశారు.

కర్ణాటకలోని బెళగావి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన సురేశ్ ఈ నెల మొదట్లో కరోనా బారినపడి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితంతుదిశ్వాస విడిచారు. కరోనా కారణంగా మృతి చెందిన తొలి కేంద్రమంత్రి సురేశే కావడం గమనార్హం.

కర్ణాటకకే చెందిన బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ ఇటీవలే కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పుడు మరో ఎంపీ మృతి చెందడంతో బీజేపీ నేతలు విషాదంలో మునిగిపోయారు. సురేశ్ అంగడికి భార్య మంగల్ సురేష్ అంగడి, ఇద్దరు కుమార్తెలు స్ఫూర్తి, శారద ఉన్నారు. సురేశ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకురాలు శోభ కరంద్లాజె తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related posts