telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక శ్రద్ధ: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh inaugurates NIA office

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమని అడగలేదని స్పష్టం చేశారు. హోదా ఇవ్వలేక పోయినా దానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇస్తున్నామని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి రూ.7 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. టీడీపీతో బీజేపీకి పొత్తు ఉన్నా లేకపోయినా ఏపీకి వచ్చే నిధులు మాత్రం ఆగవని అన్నారు. మచిలీపట్నం పోర్టును శంకుస్థాపన చంద్రబాబు ఎలాంటి పనులను చేపట్టలేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మచిలీపట్నం పోర్టును నిర్మిస్తామని, వరికి మరింత గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీనిచ్చారు. టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో బీజేపీ అగ్రనేత చెప్పే మాటలు వినడానికి ఎవరూ ఆసక్తిచూపించలేదు. ఆయన సభ జనంలేక వెలవెల పోయింది.

Related posts