telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ పై సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం…

manjrekar tweet kohli as pm

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పై సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్ కాంబినేషన్‌ను పదే పదే మార్చడం, వరుసగా విఫలమైన కేఎల్ రాహుల్‌ను జట్టులో కొనసాగించడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. వీటిపై తాజాగా స్పందించిన విరాట్ కోహ్లీ బయట జరిగే చర్చంతా నాన్‌సెన్స్ అని కొట్టిపారేశాడు. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆటగాడితో ఎలా వ్యవహరించాలో టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తెలుసు. వారు మానసికంగా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మేం ఆ పని కొనసాగిస్తున్నాం. బయట విమర్శలను ఏ మాత్రం పట్టించుకోం’ అని విరాట్‌ స్పష్టం చేశాడు. ఇక విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై మంజ్రేకర్ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. ‘బయట జరిగే చర్చంతా విరాట్ అర్థరహితమని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. కానీ అది ఆట పట్ల ప్రజలు స్పందిస్తున్న తీరని అతను తెలుసుకోవాలి. బాగా ఆడినప్పుడు ప్రశంసించనవారే.. తప్పులు చేసినప్పుడు విమర్శిస్తారు. ఓ కెప్టెన్‌గా విరాట్ ఈ విషయాన్ని గ్రహించి ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. ముఖ్యంగా ధోనీ ఎలా ఉండేవాడో తెలుసుకోవాలి’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.

Related posts