telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

అది సిరిసిల్ల ప్రజల అదృష్టం…

ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… పేదల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఎవ్వరూ సాహసం చేయని కార్యక్రమాలు సీఎం కేసీఆర్ చేస్తున్నారు. పక్క రాష్ట్ర ల ముఖ్య మంత్రులు సైతం కేసీఆర్ నిర్ణయాలతో ఆశ్చర్య పోతారు. ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాది డబుల్ బెడ్ రూం ప్లాన్ వేయించాడు. రాష్ట్రంలో 19 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల 67 వేల ఇళ్లు కట్ట బోతున్నం. కేటీఆర్ సిరిసిల్ల కూ ఎమ్మెల్యే కావడం సిరిసిల్ల ప్రజల అదృష్టం. దేశం లో నెంబర్ 1 మంత్రి కేటీఆర్. ఇప్పటి వరకు 1.67 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ప్రపంచం లో పెద్ద పెద్ద కంపెనీ లు మంత్రి కేటీఆర్ చొరవతో హైద్రాబాద్ కు వస్తున్నాయి. 19వేల ఏకరాల్లో ఫార్మా హబ్ ను ఏర్పాటు చేయబోతున్నాం. 5 లక్షల మందికి రానున్న రోజుల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి అని పేర్కొన్నారు.

Related posts